బీజేపీ ఎంపీ లక్ష్మణ్కు కీలక పదవి
తెలంగాణ నేతకు జాతీయ స్థాయిలో కీలక పదవిని అప్పగిస్తూ కమలం పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఎంపీ కె.లక్ష్మణ్ ను బీజేపీ జాతీయ రిటర్నింగ్ అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
BY Vamshi Kotas15 Oct 2024 12:58 PM GMT
X
Vamshi Kotas Updated On: 15 Oct 2024 12:58 PM GMT
తెలంగాణ బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ను బీజేపీ జాతీయ రిటర్నింగ్ అధికారిగా నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. మరి కొద్ది రోజుల్లో బీజేపీ సంస్థాగత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కమలం పార్టీ.. జాతీయ రిటర్నింగ్ ఆఫీసర్లు, కో రిటర్నింగ్ ఆఫీసర్ల నియామకం చేపట్టింది. ఇందులో కో రిటర్నింగ్ అధికారులుగా ఎంపీలు నరేష్ బన్సల్, డా. సంబిత్ పాత్రాతో పాటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు రేఖా వర్మ లను నియమించారు. వీరి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ సంస్థాగత ఎన్నికలు జరుగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Next Story