Telugu Global
Telangana

రైతులను కంటతడి పెట్టించే కాంగ్రెస్ మార్క్ "మార్పు" ఇదేనా?

మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో రైతుపై బ్యాంక్ అధికారుల దౌర్జన్యం పట్ల హరీశ్‌ ఆగ్రహం

రైతులను కంటతడి పెట్టించే కాంగ్రెస్ మార్క్ మార్పు ఇదేనా?
X

రెండు లక్షల రుణమాఫీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి చేసిన మోసం రైతుల పాలిటి శాపంగా మారింది. సీఎం చేసిన నిర్వాకానికి రైతుల పరువు బజారున పడుతున్న పరిస్థితి నెలకొన్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో రైతుపై బ్యాంక్ అధికారుల దౌర్జన్యం పట్ల హరీశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకు సిబ్బంది రైతుల ఇళ్ళ మీదికి వచ్చి తలుపులు పీకుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? అని ప్రశ్నించారు. రుణమాఫీ పై ప్రగల్భాలు పలుకుతున్న ముఖ్యమంత్రి కి ఇలాంటి సంఘటనలే చెంప పెట్టు.ఇందిరమ్మ రాజ్యం లో పేదల ఇళ్ళ మీదకు బుల్డోజర్లు, రైతుల ఇళ్ళ మీదకు బ్యాంకు అధికారులు అంటూ ధ్వజమెత్తారు ఇదేనా.. పేదలను, రైతులను కంటతడి పెట్టించే కాంగ్రెస్ మార్క్ "మార్పు"? అని నిలదీశారు.

ఎత్తు కుర్చీల్లో కూర్చోవడం కాదు-కన్నేత్తి రైతుల గోస చూడు ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. మాఫీ కానీ రుణమాఫీ, పత్తా లేని పాల బిల్లులు, వేస్తామన్న భరోసా లేని రైతు భరోసా, బోనస్ పేరుతో బోగస్ మాటలు. ఒకటా రెండా అన్నింట్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది. రైతు రోడ్డెక్కితే జంకిన మీరు రూ. 150 కోట్ల పాల బిల్లుల బకాయిలకు 50 కోట్లు విడుదల ప్రకటన చేసి చేతులు దులుపుకున్నారు. మీ పుణ్యమా అని ఈ దసరా రైతులకు మునపటి దసరా లా ఉండేలా లేదు బోగస్ హామీలతో రైతుల గొంతు నొక్కి గద్దెనెక్కి ఎత్తు కుర్చీల్లో రాచరిక దర్పాన్ని ప్రదర్శిస్తున్న మీరు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హరీశ్‌ హెచ్చరించారు.

First Published:  25 Sept 2024 3:58 AM GMT
Next Story