అంతిమంగా విజయం నిజాయితికే వరిస్తుంది..జగన్ కీలక వ్యాఖ్యలు
తెలుగు రాష్ట్రాల ప్రజలకు మాజీ సీఎం వైఎస్ జగన్ దసరా శుభాకాంక్షలు తెలిపారు
BY Vamshi Kotas11 Oct 2024 11:38 AM GMT
X
Vamshi Kotas Updated On: 11 Oct 2024 11:38 AM GMT
తెలుగు ప్రజలకు వైసీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ‘లోక కంఠకుడైన మహిషాసురుడిని జగన్మాత సంహరించినందుకు చెడుపై మంచి, దుష్ట శక్తులపై దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండగే విజయదశమి. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తిమంతమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుంది’’ అని జగన్ పేర్కొన్నారు. ఆ కనుకదుర్గమ్మవారి దీవెనలు, ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని జగన్ ఆకాంక్షించారు. ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలి. రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు సిద్ధించాలని మాజీ సీఎం కోరారు.
Next Story