ఎల్లుండి అసెంబ్లీలోకి గులాబీ బాస్
బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలకు రాబోతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ తాజాగా కీలక ప్రకటన చేసింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ నెల 11వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపింది. గత బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజు అసెంబ్లీకి హాజరైన కేసీఆర్ ఆ తర్వాత మళ్లీ హాజరుకాలేదు. ఎల్లుండి గవర్నర్ ప్రసంగానికి హాజరవుతారు, తర్వాత కొన్ని కార్యక్రమాలకు కూడా కేసీఆర్ వస్తారు కేసీఆర్ స్థాయి వేరు, వీళ్ళు మాట్లాడే పిచ్చి మాటలు, పనికిమాలిన మాటలు వినడానికి కేసీఆర్ రావొద్దు అనేది ఒక కొడుకుగా నా అభిప్రాయం కేసీఆర్ స్థాయికి కాంగ్రెస్ పార్టీలో ఎవరూ సరిపోరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
వేం నరేందర్ రెడ్డికి పదవి ఇప్పించు కోలేక పోయాడు అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి మాట ఢిల్లీ లో వినట్లేదన్నారు. ఆయన అనుచరులకు పదవులు ఇప్పించు కోలేక పోతున్నారని చురకలు అంటించారు. ఈ రోజు ఎమ్మెల్సీ అభ్యర్థుల ను చూస్తే అర్థం అవుతుందని ఎద్దేవా చేశారు. సొంత అనుచరుడు వేం నరేందర్ రెడ్డి కి కూడా పదవి ఇప్పించు కోలేక పోయాడని సెటైర్లు పేల్చారు. 39 సార్లు ఢిల్లీ కి పోయినా మంత్రి వర్గ విస్తరణ కూడా చేయలేక పోతున్నాడని మండిపడ్డారు కేటీఆర్.