Telugu Global
Telangana

14 నుంచి గ్రూప్‌ -1 మెయిన్స్‌ హాల్‌ టికెట్లు

21 నుంచి మెయిన్స్‌ పరీక్షలు

14 నుంచి గ్రూప్‌ -1 మెయిన్స్‌ హాల్‌ టికెట్లు
X

గ్రూప్‌ -1 మెయిన్స్‌ పరీక్షల హాల్‌ టికెట్లు ఈనెల 14వ తేదీ నుంచి టీఎస్‌పీఎస్సీ వెబ్‌ సైట్‌ నుంచి డౌన్‌ లోడ్‌ చేసుకోవాలని టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్‌ నికోలస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 21వ తేదీ నుంచి హెచ్‌ఎండీఏ పరిధిలోని పరీక్ష కేంద్రాల్లో గ్రూప్‌ -1 మెయిన్స్‌ పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అభ్యర్థులను పరీక్ష కేంద్రం లోపలికి మధ్యాహ్నం 12.30 గంటల నుంచి అనుమతిస్తామని, 1.30 గంటలకు గేట్లు మూసి వేస్తామని తెలిపారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత వచ్చే వారిని అనుమతించబోమని స్పష్టం చేశారు. 21 నుంచి 27వ తేదీ వరకు ఆరు రోజుల పాటు నిర్వహించే మెయిన్స్‌ పరీక్షలకు అభ్యర్థులు తప్పనిసరిగా తాము డౌన్‌ లోడ్‌ చేసుకున్న హాల్‌ టికెట్లను వెంట తెచ్చుకోవాలని సూచించారు. గ్రూప్‌ - 1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయ్యే వరకు పరీక్షలు రాసిన వారు తమ హాల్‌ టికెట్‌ తో పాటు క్వశ్చన్‌ పేపర్లను దాచిపెట్టుకోవాలన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో అభ్యర్థులకు సమయం తెలిచేలా వాల్‌ క్లాక్‌ లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హాల్‌ టికెట్ల డౌన్‌ లోడ్‌ లో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే టీజీపీఎస్సీ టెక్నికల్‌ హెల్ప్‌ డెస్క్‌ నంబర్‌ 040 - 23542185, 040 - 23542187 నంబర్లను ఆఫీస్‌ టైమింగ్స్‌ లో సంప్రదించాలని సూచించారు.

First Published:  9 Oct 2024 11:11 AM GMT
Next Story