Telugu Global
Telangana

సుప్రీంకోర్టును ఆశ్రయించిన గ్రూప్‌-1 అభ్యర్థులు

జీవో 29ని రద్దు చేయాలని.. జీవో 55నే అమలు చేయాలని పిటిషన్‌

సుప్రీంకోర్టును ఆశ్రయించిన గ్రూప్‌-1 అభ్యర్థులు
X

రాష్ట్రంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 29 రద్దు చేయాలని కోరుతూ గ్రూప్‌-1 అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తీర్పు వచ్చే వరకు వాయిదా వేయాలని కోరారు. జీవో 55నే అమలు చేయాలని కోరినా సీఎం పట్టించుకోవడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. తదుపరి విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. జీవో 29 వల్ల నష్టం జరుగుతుందని, మా పాలిట శాపంగా మారుతుందని అభ్యర్థులు వాపోతున్నారు.

దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి 2022లో జారీ చేసిన జీవో 55కు సవరణ తీసుకొస్తూ ఫిబ్రవరి 8న జారీ చేసిన జీవో 29ని రద్దు చేయాలని గ్రూప్‌-1 అభ్యర్థులు కోరుతున్నారు. జనరల్‌ కేటగిరీలోని అభ్యర్థుల కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారిని అన్‌ రిజర్వుడుగానే పరిగణిస్తుండటం వల్ల దివ్యాంగ అభ్యర్థులకు అన్యాయం జరుగుతున్నదన్నారు. వారికంటే ఎక్కువ మార్కులు వచ్చినా రిజర్వేషన్‌ కేటగిరీగానే పరిగణించి 1:50 కింద అభ్యర్థులను మెయిన్స్‌కు పిలువాలని కోరుతున్నారు. దిద్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించిన వివాదం నేపథ్యంలో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు నిలిపివేయాలని కొందరు అభ్యర్థులు కోరగా.. హైకోర్టు నిరాకరించింది. నోటిఫికేషన్‌ రద్దు చేయాలన్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. అయితే నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని విచారణను వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో గ్రూప్‌-1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

First Published:  18 Oct 2024 10:27 AM GMT
Next Story