దసరా కానుకగా పెండింగ్ డీఏలు ఇవ్వండి
ప్రభుత్వ ప్రధాన సలహాదారును కోరిన ఉద్యోగుల జేఏసీ
BY Naveen Kamera8 Oct 2024 7:24 AM GMT
X
Naveen Kamera Updated On: 8 Oct 2024 7:24 AM GMT
దసరా కానుకగా ఉద్యోగులకు పెండింగ్ డీఏలు ఇప్పించాలని ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డిని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి కోరారు. జేఏసీ నాయకులతో కలిసి సెక్రటేరియట్ లో ఆయన వేం నరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లు డీఏల కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం దసరా కానుకగా డీఏలు చెల్లిస్తుందని నమ్మకంతో ఉన్నామని తెలిపారు. గత ప్రభుత్వం రెండు డీఏలు పెండింగ్ లో పెట్టిందని, ప్రజాప్రభుత్వం వెంటనే ఆ డీఏలు రిలీజ్ చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేస్తున్న ఉద్యోగులకు సానుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు రామకృష్ణ, నిర్మల, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story