Telugu Global
Telangana

ఫోన్ చార్జింగ్ పెడుతూ 9ఏళ్ల బాలిక మృతి

ఉదయం తండ్రి వద్ద నుంచి అంజలి కార్తీక సెల్‌ ఫోన్‌ తీసుకుంది. దానికి చార్జింగ్‌ లేకపోవడంతో తడి చేతులతో చార్జింగ్‌ పెడుతుండగా ఒక్కసారిగా విద్యుత్‌ షాక్‌ తగలడంతో విలవిల్లాడుతూ కుప్పకూలింది.

ఫోన్ చార్జింగ్ పెడుతూ 9ఏళ్ల బాలిక మృతి
X

తడి చేతులతో సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ పెడుతూ కరెంట్‌ షాక్‌కు గురై బాలిక చనిపోయింది. ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి నామవరంలో జరిగింది. కటికాల రామకృష్ణ దంపతులకు కూతురు అంజలి కార్తీక (9), కుమారుడు వెంకట గణేశ్‌ ఉన్నారు. ఉదయం తండ్రి వద్ద నుంచి అంజలి కార్తీక సెల్‌ ఫోన్‌ తీసుకుంది. దానికి చార్జింగ్‌ లేకపోవడంతో తడి చేతులతో చార్జింగ్‌ పెడుతుండగా ఒక్కసారిగా విద్యుత్‌ షాక్‌ తగలడంతో విలవిల్లాడుతూ కుప్పకూలింది.

కొద్ది సేపటికి గమనించిన తల్లిదండ్రులు చేతులు, కాళ్లు రుద్దినప్పటికీ స్పర్శ రాలేదు. వెంటనే గ్రామంలోని ఓ ప్రైవేటు డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లారు. పరీక్షించిన ఆయన బాలిక అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అంజలి కార్తీక అదే గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. తండ్రి రామకృష్ణ ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేశారు.

First Published:  27 July 2024 2:37 AM GMT
Next Story