Telugu Global
Telangana

కాంగ్రెస్ పార్టీకో దండం రా బాబు.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్

మీ పార్టీకి ఓ దండం.. మమ్మల్ని ఇలా బతకనివ్వండి’ అంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు

కాంగ్రెస్ పార్టీకో దండం రా బాబు.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్
X

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీకో దండం రా బాబు అంటూ జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. హస్తం పార్టీలో ఎందుకు ఉండాలని జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలను చంపించుకోవడనికే పార్టీలో ఉన్నామా అంటు ఆగ్రహంతో ఫోన్‌ను జీవన్ రెడ్డి పక్కన పడేశారు. తన విషయంలో పార్టీ పెద్దల తీరుపై ఎమ్మెల్సీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా 40ఏళ్లు తాను కాంగ్రెస్ పార్టీలో చేసిన సేవలకి తగిన బహుమానం ఇచ్చారని జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లాలోని జాబితాపూర్ శివారులో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి(53) దారుణ హత్య కు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టి కత్తితో పొడిచి చంపినట్టు చెబుతున్నారు స్థానికులు.

దీంతో రోడ్డు బైఠాయించారు జీవన్ రెడ్డి. అయితే ఆయనను శాంతిప జేయడానికి అడ్లూరి లక్ష్మణ్‌ రంగంలోకి దిగారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతోనే తనకు తమ్ముడిలాంటి వాడిని కోల్పోయాననే ఆవేదనలో ఉన్నారని ఆయన్ను చూస్తేనే అర్థమవుతుంది. ఆ బాధతోనే ‘ మీకు.. మీ పార్టీకి ఓ దండం.. మమ్మల్ని ఇలా బతకనివ్వండి’ అంటూ కాంగ్రెస్‌పై అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.. తన ప్రధాన అనుచరుడి హత్య గురించి తెలియగానే ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. గంగారెడ్డి హత్యను నిరసిస్తూ ఆస్పత్రి ఎదుట ఆయన ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్‌ నాయకుల్నే ఇంత దారుణంగా హత్య చేసిన తర్వాత అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? లేవా? అని ప్రశ్నించారు.

First Published:  22 Oct 2024 9:03 AM GMT
Next Story