Telugu Global
Telangana

కాంగ్రెస్‌ అంటే ఉద్యోగుల సంక్షోభ ప్రభుత్వం

165 మంది ఏఈవోలు, 20 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేయడం దారుణమని మండిపడ్డ కేటీఆర్‌

కాంగ్రెస్‌ అంటే ఉద్యోగుల సంక్షోభ ప్రభుత్వం
X

కాంగ్రెస్‌ అంటే ఉద్యోగుల సంక్షోభ ప్రభుత్వమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్‌'లో వేదికగా రేవంత్‌ ప్రభుత్వ చర్యలపై విమర్శలు గుప్పించారు. 165 మంది ఏఈవోలు, 20 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేయడం దారుణమని మండిపడ్డారు. అడ్డగోలు సాకులతో వారిని సస్పెండ్‌ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హక్కులు అడిగితే సస్పెండ్‌ చేస్తారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల మాట అటుంచితే.. ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు బీఆర్‌ఎస్‌ ఎప్పుడూ అండగా ఉంటుందని హమీ ఇచ్చారు. సస్పండ్‌ చేసిన వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఉద్యోగులతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి సూచించారు.

First Published:  24 Oct 2024 5:10 AM GMT
Next Story