Telugu Global
Telangana

వివాదంలో టాలీవుడ్ హీరో రాజ్‌ తరుణ్‌

గతంలో తనను డ్రగ్స్ కేసులో ఉద్దేశపూర్వకంగా ఇరికించారని ఆరోపించింది లావణ్య. అరెస్టయి 45 రోజులు జైలులో ఉన్నప్పటికీ.. తనను రాజ్‌ తరుణ్‌ పట్టించుకోలేదని స్పష్టం చేసింది.

వివాదంలో టాలీవుడ్ హీరో రాజ్‌ తరుణ్‌
X

టాలీవుడ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. రాజ్‌ తరుణ్‌పై అతని ప్రేయసి లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. రాజ్‌ తరుణ్‌ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపించింది. అందుకు ఓ సినీ నటి కారణమని చెప్పింది. ఈ నేపథ్యంలోనే సదరు సినీ నటితో పాటు ఆమె సోదరుడిపై లావణ్య గురువారం నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రాజ్‌ తరుణ్‌ను వదిలేయాలని లేకపోతే చంపేసి బాడీ మాయం చేస్తామని తనను బెదిరిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేసింది లావణ్య.


11 ఏళ్లుగా రాజ్‌ తరుణ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని లావ‌ణ్య చెప్తోంది. రాజ్‌తరుణ్‌ తనను గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. కానీ, ఓ సినిమాలో నటిస్తున్న హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకుని తనను వదిలేశాడని లావణ్య ఆరోపించింది. రాజ్‌ తరుణ్ తనకు కావాలని, తనకు న్యాయం చేయాలని లావణ్య డిమాండ్ చేస్తోంది. ఇక గతంలో తనను డ్రగ్స్ కేసులో ఉద్దేశపూర్వకంగా ఇరికించారని ఆరోపించింది లావణ్య. అరెస్టయి 45 రోజులు జైలులో ఉన్నప్పటికీ.. తనను రాజ్‌ తరుణ్‌ పట్టించుకోలేదని స్పష్టం చేసింది. ఈ ఇష్యూ ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు రాజ్‌ తరుణ్ మాత్రం లావణ్య ఆరోపణలను కొట్టి పారేస్తున్నారు. గతంలో లావణ్యతో రిలేషన్‌షిప్‌లో ఉన్న మాట వాస్తవమేన‌ని, ఆమెను పెళ్లి చేసుకున్న మాట పచ్చి అబద్ధమన్నారు. తనను, తన కుటుంబ సభ్యులను లావణ్య టార్చర్ పెడుతోందన్నారు. లావణ్యపై డ్రగ్స్, బ్లాక్ మెయిల్ సహా మూడు కేసులున్నాయన్నారు రాజ్‌తరుణ్‌.

First Published:  5 July 2024 10:46 AM GMT
Next Story