Telugu Global
Telangana

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం - సీఎం రేవంత్

దేశంలో ప్రధాని మోదీకి వ్యతిరేక వేవ్‌ నడుస్తోందని అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టేందుకు సిద్ధమయ్యారని చెప్పారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం - సీఎం రేవంత్
X

రుణమాఫీ విషయంలో అన్నదాతలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని మరోసారి స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు బంధును రైతుల ఖాతాల్లో జమచేసినట్లే ఆగస్ట్-15లోపు రైతు రుణమాఫీని అమలు చేస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 39.5 శాతం ఓట్లు రాగా పార్లమెంట్‌ ఎన్నికల్లో అంతకుమించి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మెరుగైన స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని, దేశంలో కూడా కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పారు రేవంత్ రెడ్డి.

దేశంలో ప్రధాని మోదీకి వ్యతిరేక వేవ్‌ నడుస్తోందని అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టేందుకు సిద్ధమయ్యారని అన్నారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు కాంగ్రెస్‌ ప్రభుత్వ 100 రోజుల పాలనకు రెఫరెండం అని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుతో ప్రజలకు చేరువయ్యామని అన్నారు. బీజేపీ కూడా కేంద్ర ప్రభుత్వ పని తీరు, పదేళ్ల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండమని చెబుతోందని గుర్తుచేశారు రేవంత్ రెడ్డి.

ఎన్డీఏ కూటమి 400 సీట్లలో గెలవడం అసాధ్యమని, ప్రధాని మోదీ భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేదని అన్నారు రేవంత్ రెడ్డి. దేశంలో మతపరమైన రిజర్వేషన్లు లేవని, సామాజికంగా వెనకబడిన వారికి మాత్రమే రిజర్వేషన్లు అమలులో ఉన్నాయని తెలిపారు. ముస్లిం రిజర్వేషన్‌ను రద్దు చేస్తామని ఏపీలో ఎన్డీఏ కూటమి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. నవనీత్‌ కౌర్‌ 15 సెకన్ల కామెంట్లపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. తెలంగాణపై కేంద్రం కుట్రలు పన్నుతోందని, తెలంగాణకు వచ్చిన పెట్టుబడులను గుజరాత్ కి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారాయన. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక, తెలంగాణను మరింతగా అభివృద్ధి చేసుకుంటామని చెప్పారు రేవంత్ రెడ్డి.

First Published:  14 May 2024 3:11 AM GMT
Next Story