Telugu Global
Telangana

సీఎం రేవంత్ పిచ్చోడిలా మాట్లాడుతున్నాడు : రాజయ్య

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఫైర్‌ అయ్యారు. సీఎం రేవంత్‌ రెడ్డి పిచ్చి లేసినోడిలా మాట్లాడుతున్నాడని ఆయన అన్నారు.

సీఎం రేవంత్  పిచ్చోడిలా మాట్లాడుతున్నాడు : రాజయ్య
X

సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పిచ్చిపట్టిన వ్యక్తిలా మాట్లాడుతున్నారని, ఆయన మాట్లాడేది ఎవరికీ అర్థం కావడం లేదని రాజయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో సీఎం అజ్ఞానంపై సెటైర్లు వేశారు. సీఎం రేవంత్ దిల్‌సుఖ్‌నగర్‌లో విమానాలు కొనడానికి దొరుకుతున్నాయని అంటాడు.హైదరాబాద్‌కు మూడు దిక్కుల సముద్రం ఉందని అంటున్నాడు..

తెలంగాణలో పాలన పిచ్చోడు చేతిలో రాయిలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలనపై పట్టులేక పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షిణించాయని, ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందుల పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా దాటవేత ధోరణి అవలంభిస్తున్నారని వ్యాఖ్యానించారు.

First Published:  16 Oct 2024 3:35 PM GMT
Next Story