Telugu Global
Telangana

సీఎం చంద్ర‌బాబు తెలంగాణ‌కు రావొద్దు.. ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

టీటీడీలో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార‌సు లేఖ‌ల‌ను అనుమ‌తించ‌క‌పోతే.. ఏపీ సీఎం చంద్ర‌బాబు తెలంగాణ‌కు రావాల్సిన అవ‌స‌రం లేద‌ని జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

సీఎం చంద్ర‌బాబు తెలంగాణ‌కు రావొద్దు.. ఎమ్మెల్యే  షాకింగ్ కామెంట్స్
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు తెలంగాణకు రావాల్సిన లేదన్నారు. తెలంగాణ ఆస్తులు కావాలి కానీ.. తిరుమలలో మా లెటర్ హెడ్స్ తీసుకోరా..? అంటూ విరుచుకుపడ్డారు .ప్రజలు మమ్మల్ని గెలిపించారు.. మాకు ప్రోటోకాల్ ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. మొన్న‌నే రూ. 15 వేల కోట్లు తీసుకున్నారని అన్నారు. తిరుమల సిఫార్సు లేఖలతో వచ్చిన వారిని దర్శనానికి అనుమతించకపోవడం బాధాకరమన్నారు.

ఏపీ సీఎం తెలంగాణ, ఏపీ తనకు రెండు కళ్లలాంటివని చెప్పారని.. ఇక్కడ మాత్రం తెలంగాణ నుంచి సిఫార్సు లేఖలపై వచ్చిన వారిని అనుమతించడం లేదని వాపోయారు. అంటే సీఎం చంద్రబాబు ఇప్పుడొక కన్నును తీసేసుకున్నారా ? అని ప్రశ్నించారు. తెలంగాణలో యాదగిరిగుట్ట, భద్రాచలం దేవస్థానాలకు వచ్చే భక్తులకు ఆంధ్రా నాయకులు ఇచ్చే సిఫార్సు లేఖలను తాము అనుమతించి దర్శనాలు కల్పిస్తున్నామని గుర్తు చేశారు. ఎమ్మెల్యేలంద‌రం క‌లిసి వీఐపీ లెట‌ర్లు చెల్లేలా ఒత్తిడి తీసుకొస్తాం. లేదంటే చంద్ర‌బాబు నాయుడు మ‌న తెలంగాణ‌కు రావాల్సిన అవ‌స‌రం లేదు. ఆస్తుల కోసం, బిజినేస్ కోసం వస్తారు కానీ తిరుమ‌లలో మ‌న‌కు గౌర‌వం క‌ల్పించ‌ర‌ట‌. ఆ దేవుడే మీకు బుద్ధి చెప్తార‌ని ఆశిస్తున్నాను అని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు.

First Published:  24 Oct 2024 10:17 AM GMT
Next Story