Telugu Global
Telangana

'పట్నం'కు బీఆర్‌ఎస్‌ నేతల సంఘీభావం

కొత్తకోట పోలీస్‌ స్టేషన్‌ కు మాజీ మంత్రులు

పట్నంకు బీఆర్‌ఎస్‌ నేతల సంఘీభావం
X

కొడంగల్‌ నియోజకవర్గంలో ఫార్మా సిటీ ఏర్పాటు కోసం రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేయవద్దని పాదయాత్ర చేస్తూ అరెస్ట్‌ అయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌ కుమార్‌ రెడ్డికి బీఆర్‌ఎస్‌ నేతలు సంఘీభావం తెలిపారు. బుధవారం పోలీసులు వారిద్దరిని కొడంగల్‌ లో అరెస్ట్‌ చేసి కొత్తకోట పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. కొత్తకోట పోలీస్‌ స్టేషన్‌ కు మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, రావుల చంద్రశేఖర్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు వెళ్లి నరేందర్‌ రెడ్డి, నవీన్‌ కుమార్‌ రెడ్డితో మాట్లాడారు. ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్న వారిని అరెస్ట్‌ చేయడం అప్రజాస్వామికమని నేతలు మండిపడ్డారు.

First Published:  9 Oct 2024 11:20 AM GMT
Next Story