Telugu Global
Telangana

సీఎల్పీ సమావేశానికి బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

సీఎల్పీ సమావేశానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపుడి గాంధీతో వ్యవసాయశాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డితో హాజరయ్యారు

సీఎల్పీ సమావేశానికి  బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
X

బీఆర్‌ఎస్ పార్టీ నుంచి హస్తం పార్టీలోకి మారిన శాసన సభ్యులు కాంగ్రెస్‌ లెజిస్లేటివ్‌ పార్టీ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మాదాపూర్‌ ట్రైడెంట్ హోటల్‌లో ప్రారంభమైంది. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పీఏసీ చైర్మన్‌గాంధీ, వ్యవసాయశాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఈ సమావేశాన్నికి హాజరవ్వడం చర్చనీయాంశంగా మారింది.

లోకల్ బాడీ ఎన్నికలు,పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం,పార్టీ సభ్యత్వం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించిన తర్వాత తొలిసారిగా జరిగే ఈ సమావేశంలో పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయంపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.

First Published:  22 Sept 2024 12:21 PM GMT
Next Story