Telugu Global
Telangana

ప్రజాభవన్‌కు బాంబు బెదిరింపు కాల్.. వారి పనేనా!

ఇటీవ‌లే ఢిల్లీ, ముంబై, కొల్‌క‌తాలోని ప్రముఖ ప్రదేశాల‌కు బాంబు బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి. ఈ తరహా బాంబు బెదిరింపు కాల్స్ వెనుక ఓ ముఠా హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.

ప్రజాభవన్‌కు బాంబు బెదిరింపు కాల్.. వారి పనేనా!
X

బేగంపేట‌లోని ప్రజా భ‌వ‌న్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడం సంచలనంగా మారింది. ప్రజా భ‌వ‌న్‌లో బాంబు ఉందంటూ ఓ గుర్తు తెలియ‌ని వ్యక్తి పోలీస్‌ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు. ప‌ది నిమిషాల్లో బాంబు పేలుతుంద‌ని హెచ్చరించాడు. అప్రమ‌త్తమైన హైద‌రాబాద్ పోలీసులు ప్రజా భ‌వ‌న్ సిబ్బందికి స‌మాచారం అందించారు.

దీంతో ప్రజా భ‌వ‌న్ వ‌ద్ద భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. పోలీసులు, బాంబ్ స్వ్కాడ్ బృందాలు ప్రజా భ‌వ‌న్‌ను త‌మ ఆధీనంలోకి తీసుకున్నారు. లోపల అందరినీ ఖాళీ చేయించి బయటకు పంపించి క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్నారు. ప్రజా భ‌వ‌న్ ఆవ‌ర‌ణ‌లోనే డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్క నివాసం ఉంటున్నారు.

ఇటీవ‌లే ఢిల్లీ, ముంబై, కొల్‌క‌తాలోని ప్రముఖ ప్రదేశాల‌కు బాంబు బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి. ఈ తరహా బాంబు బెదిరింపు కాల్స్ వెనుక ఓ ముఠా హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. వరుసగా బాంబు బెదిరింపు కాల్స్ వ‌స్తున్న నేప‌థ్యంలో తెలంగాణ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

First Published:  28 May 2024 9:48 AM GMT
Next Story