Telugu Global
Telangana

రేవంత్‌ను ప్రజలు ఛీ కొడుతున్నరు.. ఈటల హాట్ కామెంట్స్

గ్రేటర్ పరిధిలో బిల్డింగ్‌ పర్మిషన్‌ కోసం కాంగ్రెస్‌ వాళ్లకు ప్రత్యేకంగా ఫీజు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు ఈటల. లేకపోతే అనుమతులు రావడం లేదన్నారు.

రేవంత్‌ను ప్రజలు ఛీ కొడుతున్నరు.. ఈటల హాట్ కామెంట్స్
X

సీఎం రేవంత్‌ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత ఈటల రాజేందర్‌. అతి తక్కువ కాలంలో ప్రజల చేత ఛీ కొట్టించుకున్న ఏకైక సీఎం రేవంత్ రెడ్డేనన్నారు. వరంగల్‌లో మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్.. తక్కువ కాలంలోనే ఎక్కువ అక్రమంగా డబ్బులు వసూలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనంటూ ఆరోపణలు చేశారు.

తెలంగాణలో RR ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా చెప్తున్నారంటే.. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్‌ నేతలు చాలా ఆకలితో ఉన్నారని.. ఎప్పటివరకూ అధికారంలో ఉంటారో తెలియక అంతా సర్దిపెట్టుకుంటున్నారన్నారు.

గ్రేటర్ పరిధిలో బిల్డింగ్‌ పర్మిషన్‌ కోసం కాంగ్రెస్‌ వాళ్లకు ప్రత్యేకంగా ఫీజు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు ఈటల. లేకపోతే అనుమతులు రావడం లేదన్నారు. ప్రజలు భిక్ష పెడితేనే రేవంత్‌కు సీఎం పదవి వచ్చిందని.. అదే ప్రజలు దెబ్బకొడితే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమన్నారు.

First Published:  21 May 2024 11:55 AM GMT
Next Story