Telugu Global
Telangana

కేసీఆర్‌కు బీజేపీ ఆహ్వానం.. వెళ్తారా!

బీజేపీకి అనూహ్యంగా సీట్లు పెరగడంతో బీజేపీకి బీఆర్ఎస్‌ ఓట్లు మళ్లించిందని కాంగ్రెస్‌ బలంగా ఆరోపణలు చేస్తోంది.

కేసీఆర్‌కు బీజేపీ ఆహ్వానం.. వెళ్తారా!
X

ప్రధాని నరేంద్రమోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు ఆహ్వానం అందినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్ర మాజీ మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం కేసీఆర్‌కు ఫోన్‌ చేసి మోడీ ప్రమాణస్వీకార వేడుక‌కు రావాల్సిందిగా కేసీఆర్‌ను కోరినట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కేసీఆర్ మోడీ ప్రమాణస్వీకారానికి హాజరయ్యేది అనుమానమే. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ తెలంగాణలోని 17 స్థానాల్లో పోటీ చేసి ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు. కానీ, కాంగ్రెస్ 8, బీజేపీ 8 స్థానాలను గెలుచుకున్నాయి.

బీజేపీకి అనూహ్యంగా సీట్లు పెరగడంతో బీజేపీకి బీఆర్ఎస్‌ ఓట్లు మళ్లించిందని కాంగ్రెస్‌ బలంగా ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మోడీ ప్రమాణస్వీకారానికి కేసీఆర్ హాజరవుతే ఈ ఆరోపణలను కాంగ్రెస్‌ ఉద్ధృతం చేసే అవకాశాలున్నాయి.

First Published:  9 Jun 2024 1:54 AM GMT
Next Story