Telugu Global
Telangana

అగ్రికల్చర్‌, ఫార్మర్‌ వెల్ఫేర్‌ కమిషన్‌ సభ్యుల నియామకం

మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌, భూమి సునీల్‌ తదితరులకు చోటు

అగ్రికల్చర్‌, ఫార్మర్‌ వెల్ఫేర్‌ కమిషన్‌ సభ్యుల నియామకం
X

తెలంగాణ అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మార్‌ వెల్ఫేర్‌ కమిషన్‌ సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిషన్‌ చైర్మన్‌ గా కిసాన్ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోదండరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా ఏడుగురు సభ్యులను అపాయింట్‌ చేసింది. కమిషన్‌ సభ్యులుగా మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌, ఎం. సునీల్‌ కుమార్‌ (భూమి సునీల్‌), ఖమ్మం జిల్లాకు చెందిన రాంరెడ్డి గోపాల్‌ రెడ్డి, నిజామాబాద్‌ జిల్లాకు చెందిన గూడూరు గంగాధర్‌, నాగర్‌ కర్నూల్‌ జిల్లాకు చెందిన కేవీ నర్సింహా రెడ్డి, సూర్యాపేట జిల్లాకు చెందిన చెవిటి వెంకన్న యాదవ్‌, మరికంటి భవానిని నియమించారు. చైర్మన్‌, ఆరుగురు సభ్యులతో వ్యవసాయ, రైతు కమిషన్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు ఇవ్వగా, సభ్యుల సంఖ్యను ఏడుగురికి పెంచుతున్నామని, ఈ మేరకు సవరణలు తీసుకువచ్చామని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

First Published:  21 Oct 2024 12:58 PM GMT
Next Story