Telugu Global
Telangana

గ్రూప్‌-3 అభ్యర్థులకు అలర్ట్.. పరీక్ష తేదీల ప్ర‌క‌ట‌న‌

తెలంగాణలో గ్రూప్‌-3 అభ్యర్థులకు రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. న‌వంబ‌ర్ 17, 18 తేదీల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని బోర్డు ప్రకటించింది.

గ్రూప్‌-3 అభ్యర్థులకు అలర్ట్.. పరీక్ష తేదీల ప్ర‌క‌ట‌న‌
X

తెలంగాణలో గ్రూప్-3 అభ్యర్థులకు రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) తాజాగా కీలక అప్‌డేట్ ఇచ్చింది. న‌వంబ‌ర్ 17, 18 తేదీల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని ఇప్ప‌టికే వెల్లడించిన బోర్డు.. తాజాగా షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇక ప‌రీక్ష‌ల‌కు వారం రోజుల ముందునుంచే హ‌ల్‌టికెట్ల‌ను అందుబాటులో ఉంచుతామ‌ని బోర్డు పేర్కొన్నాది.

అలాగే మోడ‌ల్ ఆన్సర్ బుక్‌లెట్ల‌ను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచిన‌ట్లు తెలియ‌జేసింది. కాగా, మొత్తం 1388 గ్రూప్‌-3 పోస్టులను భర్తీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,36,477 మంది అభ్య‌ర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా ఈ పోస్టులకు సంబంధించి రాత పరీక్ష తేదీలను టీజీపీఎస్‌సీ ప్రకటించింది. మోడల్‌ ఆన్సర్‌ బుక్‌లెట్లను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు టీజీపీఎస్సీ పేర్కొంది.

First Published:  11 Oct 2024 9:34 AM GMT
Next Story