Telugu Global
Telangana

దోశ తింటుండగా గొంతులో ఇర్కుక్కొని వ్యక్తి మృతి

నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తిలో జరిగిన ఘటన

దోశ తింటుండగా గొంతులో ఇర్కుక్కొని వ్యక్తి మృతి
X

నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తిలో విషాదం చోటుచేసుకున్నది. దోశ తింటుండగా ఒక్కసారి గొంతులో ఇర్కుక్కోవడంతో ఓ వ్యక్తి మృతి చెందడం స్థానికులను కలిచివేసింది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. పట్టణంలోని సుభాష్‌నగర్‌లో నివాసముంటున్న వెంకటయ్య ఉదయం ఇంటి నుంచి బైటికి వెళ్లాడు. 11 గంటల సమయంలో హోటల్‌ నుంచి దోశ పార్సిల్‌ తీసుకుని ఇంటికి వచ్చాడు. కుటుంబసభ్యుల మధ్యే తింటుండగా దోశ ముక్క గొంతులో ఇరుక్కున్నది. దీంతో నీళ్లు తాగుతుండగానే పక్కకు ఒరిగిపోయాడు. కళ్లెదుటే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. వెంకటయ్యకు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.

First Published:  24 Oct 2024 3:05 AM GMT
Next Story