Telugu Global
Telangana

20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి.. బాంబు పేల్చిన దానం!

దాదాపు 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అంతేకాదు వారి పేర్లు కూడా చెప్పేశారు దానం.

20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి.. బాంబు పేల్చిన దానం!
X

తెలంగాణలో కాంగ్రెస్‌ ఆపరేషన్ ఆకర్ష్‌ మళ్లీ మొదలైంది. తాజాగా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో మరోసారి జంపింగ్‌ జపాంగ్‌లపై చర్చ మొదలైంది. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేరిక సైతం దాదాపు కన్ఫామ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో సమావేశమయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.


ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్ బాంబు పేల్చారు. గాంధీభవన్‌లో మీడియాతో చిట్‌ చాట్‌ చేసిన దానం.. దాదాపు 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అంతేకాదు వారి పేర్లు కూడా చెప్పేశారు దానం. మాజీ మంత్రి మల్లారెడ్డి, సుధీర్ రెడ్డి, ప్రకాష్‌ గౌడ్, కొత్త ప్రభాకర్ రెడ్డి, కె.వివేకానంద, గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య సహా పలువురు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు త్వరలో బీఆర్‌ఎస్‌లో చేరతారని చెప్పారు. ఇప్పటికే ఆయా ఎమ్మెల్యేలతో సంప్రదింపులు పూర్తయ్యాయన్నారు.


కేసీఆర్ విధానాలే బీఆర్ఎస్ పార్టీ కొంపముంచాయన్నారు దానం నాగేందర్. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీ వైపు చూస్తున్నారని చెప్పారు. ఇక హరీష్ రావుతో పాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరతారని చెప్పుకొచ్చారు దానం.

First Published:  21 Jun 2024 12:09 PM GMT
Next Story