Telugu Global
Sports

ముగిసిన నాలుగో రోజు ఆట.. ఇక బౌల‌ర్ల‌పైనే ఆశలు

భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో నాలుగో రోజు ఆట ముగిసింది.

ముగిసిన నాలుగో రోజు ఆట.. ఇక బౌల‌ర్ల‌పైనే ఆశలు
X

భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో నాలుగో రోజు ఆట ముగిసింది. స‌ర్ఫ‌రాజ్ ఖాన్(150) భారీ శ‌త‌కం, రిష‌భ్ పంత్(99) విధ్వంస‌క బ్యాటింగ్‌తో కోలుకున్న టీమిండియా అనూహ్యంగా ఆఖ‌రి సెష‌న్‌లో ఆలౌట‌య్యింది. దీంతో చిన్న‌స్వామి స్టేడియంలో భార‌త ఇన్నింగ్స్ ముగిసింది.

నాలుగో రోజు స‌ర్ఫ‌రాజ్ ఖాన్(150) భారీ శ‌త‌కం, రిష‌భ్ పంత్(99) విధ్వంస‌క బ్యాటింగ్‌తో కోలుకున్న టీమిండియా అనూహ్యంగా ఆఖ‌రి సెష‌న్‌లో ఆలౌట‌య్యింది. వెలుతురు సరిగా లేకపోవడంతో మ్యాచ్‌ను ఆపేశారు. టీ బ్రేక్ తర్వాత 462 ప‌రుగుల‌కే రోహిత్ సేన‌ ఆలౌట్‌యింది. 106 పరుగుల ఆధిక్యంలో భారత్ ఉంది. అనంత‌రం కివీస్ ఇన్నింగ్స్ ఆరంభించి ఒక్క ఓవ‌ర్ కాక‌ముందే అంపైర్లు ఆట‌ను నిలిపివేశారు. టామ్ లాథమ్ (0), కాన్వేే (0) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు.

First Published:  19 Oct 2024 12:22 PM GMT
Next Story