Telugu Global
Sports

టీ 20 ఉమెన్‌ వరల్డ్‌ కప్‌.. నేడు పాక్‌ తో తలపడనున్న భారత్‌

ఈ మ్యాచ్‌ లో గెలిస్తేనే సెమీస్‌ పై ఆశలు

టీ 20 ఉమెన్‌ వరల్డ్‌ కప్‌.. నేడు పాక్‌ తో తలపడనున్న భారత్‌
X

టీ 20 ఉమెన్ వరల్డ్‌ కప్‌ లో చిరకాల ప్రత్యర్థుల మధ్య నేడు హై టెన్షన్‌ మ్యాచ్‌ జరగనుంది. లీగ్‌ దశలో మొదటి టీ 20లో న్యూజిలాండ్‌ చేతిలో ఘోర పరాజయం పాలైన భారత జట్టు ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ పై విజయం సాధిస్తేనే సెమీస్‌ ఆశలు సజీవంగా ఉండనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్‌ వీక్షించేందుకు 12 వేల మంది క్రికెట్‌ అభిమానులు టికెట్లు కొనుగోలు చేశారు. భారత్‌ తొలిమ్యాచ్‌ లో ఓడిపోవడంతో ఏ చిక్కులు లేకుండా సెమీస్‌ కు చేరాలంటే పాక్‌ తో పాటు ఆ తర్వాత ఆడబోయే మరో రెండు మ్యాచ్‌ ల్లోనూ గెలిచి తీరాలి. భారత్‌ తన తర్వాతి మ్యాచ్‌ లను శ్రీలంక, ఆస్ట్రేలియా తో ఆడనుంది.

First Published:  6 Oct 2024 5:23 AM GMT
Next Story