Telugu Global
Sports

చెస్ ఒలంపియాడ్ విజేతలకు సీఎం భారీ నజరానా

భారత్ తరపున చెస్ ఒలంపియాడ్ లో విజేతలుగా నిలిచిన తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ నజరానా ప్రకటించారు.

చెస్ ఒలంపియాడ్  విజేతలకు సీఎం భారీ నజరానా
X

భారత్ తరుపున చెస్ ఒలంపియాడ్ స్వర్ణ పతకం సాధించిన విజేతలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు. ఇవాళ సీఎం నివాసంలో తెలంగాణ క్రీడాకారులు అర్జున్ (హన్మకొండ), ద్రోణవల్లి హారిక (ఖమ్మం) మర్యాదపూర్వకంగా కలిశారు. ఫ్యూచర్‌లో మరిన్ని మెడల్స్ సాధించి దేశానికి మంచి పేరు తీసుకు రావాలని సీఎం సూచించారు.

ఇద్దరికి చేరో రూ.25 లక్షల నగదు ప్రోత్సాహకం ప్రకటించారు. తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయ వేదికల మీద పతకాలు సాధించేలా తీర్చి దిద్దేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావ్, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డి పాల్గొన్నారు.

First Published:  27 Sept 2024 2:03 PM GMT
Next Story