సోషల్ మీడియాలో వైరలవుతున్న 'మా' అనే కాప్షన్ తో సోనియా,రాహుల్ ఫోటోలు
గురువారం ఉదయం ప్రారంభమైన భారత్ జోడో యాత్రలో రాహుల్ తో పాటు సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో నడుస్తున్న తరుణంలో తన తల్లి సోనియా గాంధీ ముందు కింద కూర్చొని ఆమె షూ లేస్లు కట్టారు రాహుల్ . ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే..అంటారు. వృద్ధులైన తలిదండ్రులను కావడిలో కూర్చోబెట్టుకుని తీర్ధయాత్రలు చేసిన కాలం నుంచి నేటి ఆధునిక శ్రావణులు అక్కడక్కడా కనబడుతూనే ఉంటారు. అంత కాకపోయినా ఎంతో కొంత తలిదండ్రులను ఆదరించే వారు సమాజంలో ఉన్నారు. ఇదిలా ఉండగా, రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కర్ణాటకలో కొనసాగిస్తున్న భారత జోడో యాత్ర లో ఆయన తల్లి, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు. కొడుకు పాదయాత్ర లో ఎలా ఉన్నాడు అని చూసేందుకే కాదు..పార్టీ శ్రేణులను ఉత్సాహపర్చడానికి కూడా. ఇదంతా ఒక ఎత్తైతే ఈ సందర్భంలో కెమెరా కంటికి చిక్కిన అద్భుతమైన దృశ్యం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
గురువారం ఉదయం ప్రారంభమైన భారత్ జోడో యాత్రలో రాహుల్ తో పాటు సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో నడుస్తున్న తరుణంలో తన తల్లి సోనియా గాంధీ ముందు కింద కూర్చొని ఆమె షూ లేస్లు కట్టారు రాహుల్ . యాత్రలో పాల్గొనడం ఆ ఫోటోలు తీయడంలో ఏం కిక్కు ఉంటుందిలే అనుకున్న ఓ ఫొటోగ్రాఫర్ ఈ అరుదైన దృశ్యాన్ని క్లిక్మనిపించారు. ఆ ఫోటోను కాంగ్రెస్ పార్టీ తన ట్విటర్ హ్యాండిల్ 'మా' అనే క్యాప్షన్తో షేర్ చేసింది.
मां ❤️ pic.twitter.com/0UgqF9hfw6
— Congress (@INCIndia) October 6, 2022
పార్టీ కార్యకర్తల హర్షధ్వానాలు, నినాదాల మధ్య, కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో ఇద్దరూ ఇతర నాయకులతో కలిసి సుమారు రెండు కిలోమీటర్లు నడిచారు. రాహుల్ తన తల్లి భుజం చుట్టూ చేయి వేసుకుని నడుస్తున్న చిత్రం కూడా ఉంది, దానికి అతను క్యాప్షన్ ఇచ్చాడు: "మేము అనేక తుఫానులను ఎదుర్కొన్నాము. అన్ని సవాళ్లను అధిగమిస్తాము. అందరం కలిసి భారతదేశాన్ని ఏకం చేస్తాము.'' అని కామెంట్ చేశారు రాహుల్. ఇద్దరు గాంధీలు కలిసి నడుస్తూ, మహిళలు, పిల్లలతో మాట్లాడటం, రోడ్డు పక్కన ఉన్న వారిని కలుస్తూ వారితో సంభాషించడం వంటి పొటోలను కూడా పార్టీ షేర్ చేసింది. "ప్రేమ కవచం(అభయంగా) ఉన్నవారు దేనికీ భయపడరు! రోడ్డు మీద, అలా ముందుకు సాగుతూనే ఉంటారు" అని ఒక పోస్ట్ పేర్కొంది.
हम पहले भी तूफानों से कश्ती निकाल कर लाए हैं, हम आज भी हर चुनौतियों की हदें तोड़ेंगे, मिलकर भारत जोड़ेंगे। pic.twitter.com/RCR46zYXZJ
— Rahul Gandhi (@RahulGandhi) October 6, 2022
75 ఏళ్ల సోనియా గాంధీ 27వ రోజు భారత్ జోడో యాత్రలో చేరి దాదాపు అరగంట పాటు నడిచారు. ఆమె కొద్ది దూరం నడవాల్సి ఉంది, కానీ ఎక్కువసేపు నడిచేందుకే మొగ్గు చూపారు. వెనక్కి వె|ళ్ళేందుకు నిరాకరించారు. ఈ ఏడాది ప్రారంభంలో కోవిడ్-19 నుంచి కోలుకున్న తర్వాత సోనియా గాంధీ పబ్లిక్ ఈవెంట్లో పాల్గొనడం ఇదే తొలిసారి. ఆమె చివరిసారిగా ఆగస్టు 2016లో వారణాసిలో జరిగిన రోడ్షోలో పాల్గొంది, అక్కడ ఆమె భుజానికి గాయం అయ్యింది. ఆ తరువాత శస్త్రచికిత్స చేయించుకున్నారు.