Telugu Global
National

ఫోన్ తీసుకున్నాడని భర్తకు కరెంట్ షాక్..

అత్తింటివారి సలహాతో భార్య ఫోన్‌ తీసుకున్నాడు ప్రదీప్‌సింగ్‌. దీంతో భర్తపై కోపం పెంచుకున్న బేబీ యాదవ్‌.. అదును చూసి అతనికి మత్తుమందు ఇచ్చింది.

ఫోన్ తీసుకున్నాడని భర్తకు కరెంట్ షాక్..
X

ప్రస్తుతం చిన్నాపెద్దా తేడా లేకుండా మొబైల్‌కు బానిసలు అయిపోయారు. సర్ది చెప్పడానికి ప్రయత్నించినా సైకోలుగా మారి విపరీతంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘటన షాక్‌కు గురిచేస్తోంది. మొబైల్ లాక్కున్నాడనే కోపంతో భర్తకు కరెంట్ షాక్ పెట్టింది భార్య. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు.

మ్యాటర్‌లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురికి చెందిన బేబీ యాదవ్‌, ప్రదీప్‌ సింగ్ భార్యాభర్తలు. వీరికి 14 ఏండ్ల కుమారుడు ఉన్నాడు. బేబీ యాదవ్‌ కొంతకాలంగా ఓ వ్యక్తితో గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడుతోంది. దీంతో భర్త ఆమెను హెచ్చరించాడు. అయినా వినకపోవడంతో ఆమె తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. ఆమె నుంచి ఫోన్‌ తీసుకోవాలని వారు సలహా ఇచ్చారు.

అత్తింటివారి సలహాతో భార్య ఫోన్‌ తీసుకున్నాడు ప్రదీప్‌సింగ్‌. దీంతో భర్తపై కోపం పెంచుకున్న బేబీ యాదవ్‌.. అదును చూసి అతనికి మత్తుమందు ఇచ్చింది. మంచానికి కట్టేసి విచక్షణా రహితంగా కొట్టింది. అంతటితో ఆగకుండా పలుమార్లు కరెంట్‌ షాక్‌ పెట్టింది. అడ్డుకోబోయిన కుమారుడిపైనా దాడి చేసింది. భార్య చెర నుంచి ఎలాగోలా తప్పించుకున్న ప్రదీప్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమెపై హత్యాయత్నం సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. పరారీలో ఉన్న బేబీ యాదవ్ కోసం గాలిస్తున్నారు.

First Published:  31 May 2024 8:41 AM GMT
Next Story