అసెంబ్లీలో గుట్కా తిని ఊసిన ఎమ్మెల్యే..వీడియో ఇదిగో
ఓ ఎమ్మెల్యే గుట్కా తిని అసెంబ్లీ హాల్ ఎంట్రీ మెట్ల వద్ద ఊసాడు.

ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే గుట్కా తిని అసెంబ్లీ హాల్ ఎంట్రీ మెట్ల వద్ద ఊసాడు. యూపీ స్పీకర్ సతీశ్ మహానా శాసన సభలోకి వెళ్తుండగా.. ఆ విషయాన్ని గుర్తించాడు.వెంటనే భద్రతా సిబ్బందిని పిలిపించి ఈ విషయంపై ఆరా తీశారు. ఓ ఎమ్మెల్యే గుట్కా తింటూ వచ్చారని, సరిగ్గా మెట్ల వద్ద ఊశారని భద్రతా సిబ్బంది గుర్తించి స్పీకర్కు చెప్పగా..ఈ పని చేసిన ఎమ్మెల్యే ఎవరో స్వచ్చందంగా ముందుకు వచ్చి అంగీకరించకపోతే తానే బయటపెడతానని హెచ్చరించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ఓ ఎమ్మెల్యే ఇలా చేసినట్లు గుర్తించారు. ఇలాంటి ఘటనలు సహించబోమని సభాపతి హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
గుట్కా తిని అసెంబ్లీలో ఊసిన ఎమ్మెల్యే
— Telugu360 (@Telugu360) March 4, 2025
యూపీ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా అసెంబ్లీలోకి వెళ్తూండగా.. ఎంట్రీ వద్ద ఎవరో గోడ మీద గుట్కా తిని ఊసినట్లుగా గుర్తించారు. వెంటనే భద్రతా సిబ్బందిని ఆరా తీశారు. ఓ ఎమ్మెల్యే అలా చేశాడని గుర్తించారు.
ఈ పని చేసిన ఎమ్మెల్యే ఎవరో స్వచ్చందంగా… pic.twitter.com/s31HoxgLMD