Telugu Global
National

మోడీ సర్కార్‌ ఏ క్షణమైనా కూలిపోతుంది.. - కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే

ప్రధాని నరేంద్ర మోడీకి మాత్రం మంచిని కొనసాగించే అలవాటు లేదని ఆయన విమర్శించారు. ఏదేమైనప్పటికీ దేశాన్ని బలోపేతం చేయడం కోసం తాము పూర్తి సహకారం అందిస్తామని ఖర్గే చెప్పారు.

మోడీ సర్కార్‌ ఏ క్షణమైనా కూలిపోతుంది.. - కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే
X

కేంద్రంలోని మోడీ సర్కార్‌ ఏ క్షణమైనా కూలిపోతుందని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. అది పొరపాటుగా ఏర్పాటైన సంకీర్ణ ప్రభుత్వమని ఆయన చెప్పారు. బెంగళూరులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి పూర్తి సంఖ్యాబలం లేదని ఆయన గుర్తుచేశారు. ఇది మైనార్టీ ప్రభుత్వమని చెప్పారు.

ఎన్డీయే సర్కారు ఎప్పుడైనా కూలిపోవచ్చని వ్యాఖ్యానించిన ఖర్గే.. ప్రభుత్వం కూలిపోవాలని తాము కోరుకోవట్లేదని చెప్పారు. దేశానికి మంచి జరగాలని, అందుకోసం కలిసికట్టుగా పనిచేయాలనే తాము ఆశిస్తున్నామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీకి మాత్రం మంచిని కొనసాగించే అలవాటు లేదని ఆయన విమర్శించారు. ఏదేమైనప్పటికీ దేశాన్ని బలోపేతం చేయడం కోసం తాము పూర్తి సహకారం అందిస్తామని ఖర్గే చెప్పారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 293 సీట్లు సాధించిన సంగతి తెలిసిందే. గత రెండు సార్లు సొంతంగా మెజార్టీ మార్క్‌ దాటిన బీజేపీ.. ఈసారి బలం భారీగా తగ్గి 240 సీట్లకు పరిమితమవడం గమనార్హం. అదే క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ తన బలం గణనీయంగా పెంచుకుంది.

First Published:  15 Jun 2024 2:14 PM GMT
Next Story