Telugu Global
National

ఘోర బస్సు ప్రమాదం... హైదరాబాద్ నుంచి యూపీ వెళ్తున్న‌ 15 మంది దుర్మరణం

దీపావళి కోస‍ం హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్ లోని తమ స్వంత గ్రామాలకు వెళ్తున్న 15 మంది కూలీలు మధ్యప్రదేశ్ లో జరిగిన ఓ బస్సు ప్రమాదంలో మరణించారు. దాదాపు 40 మంది గాయపడ్డారు

ఘోర బస్సు ప్రమాదం... హైదరాబాద్ నుంచి యూపీ వెళ్తున్న‌ 15 మంది దుర్మరణం
X

మధ్యప్రదేశ్‌లోని రేవాలో బస్సు ట్రక్కును ఢీకొన్న ఘటనలో 15 మంది మరణించగా 40 మంది గాయపడ్డారు.

సుమారు 100 మందితో బస్సు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు వెళ్తుండగా ఈ తెల్లవారుజామున‌ రేవాలోని సుహాగి పహారీ సమీపంలో ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది.

క్షతగాత్రులను సుహాగిలోని జిల్లా ఆసుపత్రికి తరలించగా, తీవ్ర గాయాలపాలైన వారిని రేవాలోని సంజయ్ గాంధీ మెమోరియల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు.

బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్‌కు చెందిన కూలీలని, వారు హైదరాబాద్ నుండి తమ స్వగ్రామాలకు వెళ్ళడానికి ప్రత్యేక బస్సులో కట్నీ వరకు వచ్చారని, కట్నీలో ఈ బస్సు ఎక్కారని రేవా పోలీసు సూపరింటెండెంట్ నవనీత్ భాసిన్ తెలిపారని ఎన్ డీటీవీ పేర్కొంది. ఈ కూలీల బృందం దీపావళికి ఇంటికి వెళుతున్నట్లు అధికారులు తెలిపారు.

అయితే మరికొన్ని వార్తా పోర్టల్లు మాత్రం ఈ బస్సు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గా ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ కు వెళ్తుండగా ఈ స‍ంఘటన జరిగిందని పేర్కొన్నాయి.

First Published:  22 Oct 2022 3:57 AM GMT
Next Story