Telugu Global
National

పెళ్లింట పెను విషాదం.. ట్రాక్టర్‌ బోల్తా పడి 13 మంది మృతి

మృతులు, క్ష‌త‌గాత్రులు పొరుగున ఉన్న రాజస్థాన్‌లోని మోతీపురా గ్రామం నుంచి వస్తున్నారని, వీరంతా కులంపూర్‌కు వెళుతున్న వివాహ బృందం సభ్యులని మరో అధికారి తెలిపారు.

పెళ్లింట పెను విషాదం.. ట్రాక్టర్‌ బోల్తా పడి 13 మంది మృతి
X

పెళ్లింట పెను విషాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందం వెళుతున్న ట్రాక్టర్‌ బోల్తా పడి 13 మంది మృతిచెందారు. మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటనలో మరో 15 మంది గాయపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌ జిల్లాలో గల పిప్లోడిలో ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. గాయపడినవారిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వారిని మెరుగైన చికిత్స కోసం భోపాల్‌కు తరలించారు. మిగిలిన 13 మందిని స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడినవారెవరికీ ప్రాణాపాయం లేదని రాజ్‌గఢ్‌ జిల్లా కలెక్టర్‌ హర్ష్‌ దీక్షిత్‌ మీడియాకు వెల్లడించారు.

మృతులు, క్ష‌త‌గాత్రులు పొరుగున ఉన్న రాజస్థాన్‌లోని మోతీపురా గ్రామం నుంచి వస్తున్నారని, వీరంతా కులంపూర్‌కు వెళుతున్న వివాహ బృందం సభ్యులని మరో అధికారి తెలిపారు. ఘటన గురించి తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టారు. ఊహించని ఈ ఘటనలో తమవారు మృతిచెందడంతో పెళ్లి బృందం సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

First Published:  3 Jun 2024 7:19 AM GMT
Next Story