Telugu Global
National

లోయలో పడిన టెంపో.. 10 మంది మృతి – మరో 15 మందికి గాయాలు

ప్రయాణికులతో వెళుతున్న టెంపో అదుపు తప్పి లోయలో పడిన ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

లోయలో పడిన టెంపో.. 10 మంది మృతి – మరో 15 మందికి గాయాలు
X

ప్రయాణికులతో వెళుతున్న టెంపో అదుపు తప్పి లోయలో పడిన ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో ఉత్తరాఖండ్‌లో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 23 మంది ప్రయాణికులతో రుద్ర ప్రయాగ్‌ వైపుగా వెళుతున్న టెంపో అదుపుతప్పి లోయలో పడిపోయింది.

ఆ లోయ దాదాపు 150–200 మీటర్ల లోతు ఉంటుంది. రైటోలి సమీపంలో రిషికేశ్‌– బద్రీనాథ్‌ హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా.. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వాహనం లోయలోని అలనంద నదిలో పడిపోయినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న రెస్క్యూ బృందం వెంటనే ఘటనాస్థలికి చేరుకుంది.

స్థానికుల సహకారంతో సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను వారు స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి విచారం వ్యక్తంచేశారు.

First Published:  15 Jun 2024 4:10 PM GMT
Next Story