Telugu Global
International

214 మంది పాక్‌ సైనికులను చంపేశాం

ఆపరేషన్‌ ముగిసినట్లు పాక్‌ ఆర్మీ ప్రకటన...బలూచ్‌ మిలిటెంట్లు ఇందుకు విరుద్ధంగా పేర్కొనడం విశేషం.

214 మంది పాక్‌ సైనికులను చంపేశాం
X

పాకిస్థాన్‌లోని వేర్పాటువాద బలూచ్‌ మిలిటెంట్లు మంగళవారం ప్రయాణికుల రైలును హైజాక్‌ చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. తమ రాజకీయ ఖైదీలను విడుదల చేయడానికి పాకిస్థాన్‌ సర్కార్‌కు ఇచ్చిన సమయం ముగియడంతో తమ చెరలో ఉన్న 214 మంది పాక్‌ సైన్యాన్ని చంపేస్తామని పేర్కొన్నది. ఆపరేషన్‌ ముగిసిందంటూ ఇస్లామాబాద్‌ ప్రభుత్వం చేసిన ప్రకటనను కూడా ఖండించింది.

మా రాజకీయ ఖైదీల విడుదలకు పాకిస్థాన్ సైన్యానికి 48 గంటల టైమ్ ఇచ్చాం. మా చెరలో బందీలుగా ఉన్నవారిని రక్షించుకోవడానికి సైన్యానికి మేము ఇచ్చిన చివరి అవకాశం. కానీ పాక్‌ తన మొండితనాన్ని, సైనిక దురహంకారాన్ని ప్రదర్శించింది. ఫలితంగా శత్రు సైన్యానికి చెందిన 214 మందిని మేం హతమార్చాం. బీఎల్‌ఏ ఎప్పుడూ అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే వ్యవహరిస్తుంది. అయితే ఇస్లామాబాద్‌ సైన్యం తమ సిబ్బందిని కాపాడుకోవడానికి బదులు మాతో పోరాడాలని యత్నించింది. ఫలితంగా బందీలను కోల్పోయింది. జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగిల్లోని బందీలను రక్షించడానికి పాకిస్థాన్‌లోని ఎస్‌ఎస్‌జీ కంమాండోలు రాగానే మా యోధులు వారిని చుట్టిముట్టి భీకర దాడి చేశారు. గంటల పాటు సాగిన ఈ దాడుల్లో పలువురు బందీలను ఉరితీయగా.. ఎస్‌ఎస్‌జీ కమాండోలు భారీ ప్రాణనష్టాన్ని చవిచూశారు. మా వాళ్లు చివరి బుల్లెట్‌ వరకు పోరాడారు.

చనిపోయిన తిరుగుబాటుదారుల మృతదేహాలను చూపించి విజయం సాధించామని ఇస్లామాబాద్‌ ప్రభుత్వం వాస్తవాలనూ కప్పిపుచ్చుతున్నది. సైన్యం, ఇంటెలిజెన్స్‌ బృందం ఉన్నప్పటికీ బందీలను రక్షించుకోవడంలో శత్రు సైన్యం విఫలమైంది. యుద్ధ సూత్రాలకు కట్టుబడి మేము విడుదల చేసిన వారిని కాపాడినట్లు ప్రకటించకుంటున్నది. ఈ యుద్ధం ఇంకా ముగియలేదు. బలూచ్‌ యోధులు వివిధ ప్రాంతాల్లో మెరుపుదాడులతో ఆక్రమిత సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుటున్నారు. ఈ ఆపరేషణ్‌లో బలూచ్‌ విజయం సాధించింది అని మిలిటెంట్ సంస్థ పేర్కొన్నది. ఇక హైజాక్‌ సమయంలో మరణించిన బీఎల్‌ఏలకు మిలిటెంట్‌ సంస్థ నివాళులు అర్పించింది.

పాక్‌లోని క్వెట్టా నుంచి పెషావర్‌కు 440 మంది ప్రయాణికులతో వెళ్తున్న జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ ను బలూచ్‌ వేర్పాటువాదులు హైజాక్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది బందీలు మరణించగా.. సుమారు 33 మంది వేర్పాటువాదులను మట్టుబెట్టి మిగతా సకనచాఫిరేలపే అందరినీ సురక్షితంగా విడిపించామని పాకిస్థాన్‌ సైన్యం ప్రకటించింది. బలూచ్‌ మిలిటెంట్లు చంపిన 26 మంది బందీల్లో 18 మంది సైనికులను పాక్‌ ఆర్మీ కూడా పేర్కొన్నది. ఇక ఈ ఆపరేషన్‌ ముగిసినట్లు ప్రకటన విడుదల చేసింది. అయితే బలూచ్‌ మిలిటెంట్లు ఇందుకు విరుద్ధంగా పేర్కొనడం విశేషం.

First Published:  15 March 2025 1:52 PM IST
Next Story