శ్రీవారి ఆలయ పరకామణి లెక్కింపులో అవకతవకలు
టీటీడీ ఉద్యోగి కృష్ణకుమార్ చేతివాటం.. ఆయనపై వేటు వేసిన ఆలయ ఈవో
BY Raju Asari11 March 2025 10:29 AM IST

X
Raju Asari Updated On: 11 March 2025 10:29 AM IST
చెన్నైలో టీటీడీకి చెందిన శ్రీవారి ఆలయ పరకామణి లెక్కింపులో అవకతవకలు జరిగాయి. శ్రీవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకల్లో టీటీడీ ఉద్యోగి కృష్ణకుమార్ చేతివాటం ప్రదర్శించారు. విదేశీ కరెన్సీని ఆయన దారి మళ్లించారు. ఆ కరెన్సీ లెక్కింపులో తేడా ఉన్నట్లు గుర్తించిన టీటీడీ విజిలెన్స్ విభాగం.. సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కృష్ణకుమార్ అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారించింది. ఈ మేరకు టీటీడీ ఈవో శ్యామలరావుకు నివేదిక సమర్పించింది. దాని ఆధారంగా కృష్ణకుమార్ను ఈవో సస్పెండ్ చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Next Story