వరంగల్లో ఘోర రోడ్డు ప్రమాదం.ఏడుగురు మృతి
వరంగల్ మామునూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
BY Vamshi Kotas26 Jan 2025 12:37 PM IST

X
Vamshi Kotas Updated On: 26 Jan 2025 12:40 PM IST
వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో ఉన్న లారీ అదుపు తప్పి ఆటోలపై పడిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో 6 గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇనుప స్తంభాల లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడింది. ఈ సందర్భంగా రెండు ఆటోలపై లారీ పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందారు.
ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. మృతిచెందిన వారిలో ముగ్గురు మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story