Telugu Global
Cinema & Entertainment

నాంపల్లి కోర్టుకు నేడు నాగార్జున

మంత్రి కొండా సురేఖపై పరువునష్టం కేసులో నాగార్జున వాంగ్మూలాన్ని నమోదు చేయనున్న కోర్టు

నాంపల్లి కోర్టుకు నేడు నాగార్జున
X

నాంపల్లి కోర్టుకు నటుడు నాగార్జున నేడు హాజరుకానున్నారు. మంత్రి కేటీఆర్‌పై విమర్శలు చేసే క్రమంలో సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబాన్ని, వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఈ క్రమంలో మంత్రి సురేఖపై నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై నాంపల్లి ప్రత్యేక కోర్టు మరోసారి విచారించనున్నది. ఆయన వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేయనున్నది.

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా.. నిన్న నాంపల్లిలో కోర్టులో విచారణ జరిగింది. శుక్రవారం విచారణ జరగాల్సి ఉండగా జడ్జి లీవ్‌లో ఉండటంతో నిన్నటికి వాయిదా పడింది. అయితే ఇవాళ నాగార్జున వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేయనున్నది.మరోవైపు ఈ కేసులో కోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందో ఉత్కంఠ అటు రాజకీయవర్గాల్లో, సినీవర్గాల్లోనూ నెలకొన్నది.

First Published:  8 Oct 2024 6:13 AM GMT
Next Story