Telugu Global
Cinema & Entertainment

Mythri Movie Makers | నైజాంలో 'మైత్రీ' హవా

Mythri Movie Makers - నిర్మాణ రంగంలోనే కాదు, పంపిణీ రంగంలో కూడా మైత్రీ మూవీ మేకర్స్ దూసుకుపోతోంది. వరుసపెట్టి సినిమాల్ని రిలీజ్ చేస్తోంది.

Mythri Movie Makers | నైజాంలో మైత్రీ హవా
X

భారీ సినిమాలు నిర్మించడమే కాదు, చాలా సినిమాల్ని పంపిణీ చేస్తూ తన హవా చూపిస్తోంది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. మరీ ముఖ్యంగా నైజాంలో ఈ కంపెనీ పాగా వేయాలని ఎప్పట్నుంచో భావిస్తోంది. ఓవైపు దిల్ రాజు, మరోవైపు ఏషియన్ సురేష్ కంపెనీ (సునీల్ నారంగ్, సురేష్ బాబు జాయింట్ కంపెనీ) పోటీగా ఉన్నప్పటికీ మైత్రీ మూవీస్ తన డిస్ట్రిబ్యూషన్ ను కొనసాగిస్తూనే ఉంది.

జాగా ఈ సంస్థ, ఒకేసారి 4 సినిమాల నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను దక్కించుకోవడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈరోజు రిలీజైన భజే వాయువేగం, గం గం గణేశా సినిమాల్ని నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీ రిలీజ్ చేసింది.

ఈ సినిమాల తర్వాత వారం గ్యాప్ లో జూన్ 7వ తేదీన వస్తున్న సత్యభామ సినిమాను, శర్వానంద్ మనమే మూవీని కూడా నైజాంలో ఈ కంపెనీనే రిలీజ్ చేస్తోంది.

ఓవైపు దిల్ రాజు, ఏషియన్ సునీల్, సురేష్ బాబు లాంటి బడా ప్లేయర్స్ సీన్ లో ఉన్నప్పటికీ.. మైత్రీ సంస్థ ఇలా డిస్ట్రిబ్యూషన్ లో దూసుకుపోవడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మరోవైపు నిర్మాణ రంగంలో కూడా ఈ సంస్థ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమాను పట్టాలపైకి తీసుకురాబోతోంది. అజిత్ హీరోగా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా సెట్స్ పై ఉంది. విజయ్ దేవరకొండ-రాహుల్ సంకృత్యాన్ సినిమా ఎనౌన్స్ చేసింది. పుష్ప-2ను విడుదలకు సిద్ధం చేస్తోంది.

First Published:  31 May 2024 4:48 PM GMT
Next Story