Telugu Global
Cinema & Entertainment

Committee Kurrollu | చిరంజీవి మెచ్చిన కమిటీ కుర్రోళ్లు

Committee Kurrollu Movie - నిహారిక కొణెదల నిర్మించిన కమిటీ కుర్రాళ్లు సినిమాను చిరంజీవి ప్రత్యేకంగా వీక్షించారు. యూనిట్ ను మెచ్చుకున్నారు.

Committee Kurrollu | చిరంజీవి మెచ్చిన కమిటీ కుర్రోళ్లు
X

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను పరిచయం చేస్తూ ఈ చిత్రానికి య‌దు వంశీ దర్శకత్వం వహించారు.

ఆగస్ట్ 9న ఈ చిత్రం విడుదల అవ్వగా. డిఫరెంట్ కంటెంట్‌తో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుని వసూళ్లను రాబడుతోంది. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శ‌సంలను అందుకున్న ఈ సినిమాకు సెల‌బ్రిటీల నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. ఇప్ప‌టికే మ‌హేష్‌, రామ్ చ‌ర‌ణ్‌, రాజ‌మౌళి, సుకుమార్‌, క్రిష్‌, దేవిశ్రీప్ర‌సాద్ ఇలా చాలా మంది క‌మిటీ కుర్రోళ్ళు టీమ్‌ను అభినందించారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘క‌మిటీ కుర్రోళ్ళు’ సినిమాను ప్ర‌త్యేకంగా వీక్షించి ఎంటైర్ టీమ్‌ను ప్ర‌త్యేకంగా మెచ్చుకున్నారు.

"క‌మిటీ కుర్రోళ్ళు సినిమా చూశాను.. చాలా చ‌క్క‌గా ఉంది. అంద‌రూ కొత్త కుర్రాళ్లే. చాలా బాగా చేశారు. సినిమా చూస్తున్న‌ప్పుడు కొత్త‌వాళ్లు యాక్ట్ చేస్తున్నార‌నే విష‌యాన్ని మ‌ర‌చిపోయాను. ఎమోష‌న‌ల్ సీన్స్ చాలా చ‌క్క‌గా రీజ‌న‌బుల్ బ‌డ్జెట్‌లో సినిమాను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు య‌దువంశీకి ప్ర‌త్యేక‌మైన అభినంద‌నలు."

మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ లాంటి సినిమాల రాకతో కమిటీ కుర్రోళ్ల థియేట్రికల్ రన్ దాదాపు ముగిసింది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో ప్రత్యక్షమౌతుంది.

First Published:  20 Aug 2024 4:53 PM GMT
Next Story