Telugu Global
Cinema & Entertainment

Bobby Kolli | నిర్మాతగా మారిన బ్లాక్ బస్టర్ డైరక్టర్

Bobby Kolli - దర్శకుడు బాబి నిర్మాతగా మారాడు. శ్రీవిష్ణుతో సినిమాను ప్రారంభించాడు.

Bobby Kolli | నిర్మాతగా మారిన బ్లాక్ బస్టర్ డైరక్టర్
X

హీరో శ్రీవిష్ణు సామజవరగమన, ఓం భీమ్ బుష్‌ సినిమాలతో వరుసగా హిట్స్ కొట్టాడు. ఈ రోజు తన 19వ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు జానకి రామ్ మారెళ్ల దర్శకత్వం వహించనున్నాడు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్, విజిల్ వర్తీ ఫిల్మ్స్, కేఎఫ్సీ బ్యానర్లపై ఈ సినిమా రాబోతోంది. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి, ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. బాబి భార్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

తెలుగు నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా, పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖుల సమక్షంలో ఈ సినిమాను ఈరోజు ఘనంగా ప్రారంభించారు. నవీన్ యెర్నేని, నందిని రెడ్డి, కిషోర్ తిరుమల స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు. దిల్ రాజు క్లాప్‌ కొట్టగా, అనిల్ రావిపూడి కెమెరా స్విచాన్ చేశారు. తొలి షాట్‌కి వివి వినాయక్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ముహూర్తం వేడుకకు సాహు గరిపాటి, మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్, శరత్ మరార్, సితార నాగ వంశీ, బివిఎస్ రవి, తదితరులు హాజరయ్యారు.

ఇది చాలా డిఫరెంట్ స్క్రిప్ట్ అంటున్నాడు శ్రీవిష్ణు. బాబి తన సినిమాతో నిర్మాతగా మారడం ఆనందంగా ఉందని, ఈ సినిమాకు మంచి టీమ్ కుదిరిందని అంటున్నాడు. కచ్చితంగా అందరికీ ఒక ఆహ్లాదకరమైన సినిమా ఇస్తానని ప్రామిస్ చేశాడు.

'పవర్' సినిమా నుంచి బాబి దగ్గర అసోషియేట్ గా చేస్తున్నాడు జానకి రామ్. అందుకే ఇతడ్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, తను నిర్మాతగా మారాడు బాబి. శ్రీవిష్ణు హీరో అనగానే ప్రాజెక్టుకు ఓకే చెప్పిన బాబి.. ఈ సినిమా హిలేరియస్ గా ఉంటుందని చెబుతున్నాడు. బేబి ఫేమ్ విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు

First Published:  9 April 2024 5:12 PM GMT
Next Story