Telugu Global
Cinema & Entertainment

Allu Sirish | బడ్డీ అందుకే లేట్ అయింది

Allu Sirish - బడ్డీతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు అల్లు శిరీష్. ఈ సినిమా రిలీజ్ ఆలస్యమైంది. దీనికి శిరీష్ దగ్గర రీజన్ ఉంది.

Allu Sirish | బడ్డీ అందుకే లేట్ అయింది
X

అల్లు శిరీష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “బడ్డీ”. గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించారు.

అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. రేపు “బడ్డీ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో చిత్ర విశేషాలను తెలిపాడు హీరో అల్లు శిరీష్.

"బడ్డీ మూవీని లాస్ట్ ఇయర్ మార్చి లో మొదలుపెట్టి జూలైలో సినిమా కంప్లీట్ చేశాం. డిసెంబర్ లోనే రిలీజ్ కు తీసుకురావాలని అనుకున్నాం. అయితే ఈ సినిమాలో 3 వేలకు పైగా సీజీ షాట్స్ ఉన్నాయి. బడ్డీ ఫేస్ ను యానిమేట్ చేయాలి. వాటిని పర్పెక్ట్ గా చేయాలంటే డబ్బుతో పాటు ఆర్టిస్టులకు టైమ్ ఇవ్వాలి. దాంతో లేట్ అయ్యింది. సమ్మర్ అనుకున్నది ఆగస్టుకు పోస్ట్ పోన్ అయ్యింది. బొమ్మకు ప్రాణం వస్తే ఎలా ఉంటుందనే కీ పాయింట్ మీదే సినిమా ఉంటుంది కాబట్టి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కు తగ్గకుండా సీజీ వచ్చింది."

ఇలా తన సినిమా లేట్ వెనక రీజన్ ను బయటపెట్టాడు అల్లు శిరీశ్. ఈ సినిమాను అతి తక్కువ టికెట్ రేట్లకే థియేటర్లలో ఎంజాయ్ చేయమని కోరుతున్నారు. మ్యాగ్జిమమ్ సినిమాలు తక్కువ టికెట్ రేట్లతో థియేటర్లలోకి వస్తే, టాలీవుడ్ కు పూర్వ వైభవం వస్తుందంటున్నాడు ఈ హీరో.

First Published:  1 Aug 2024 5:26 PM GMT
Next Story