Telugu Global
Cinema & Entertainment

Adah Sharma | సుశాంత్ ఇంట్లో అదా శర్మ

Adah Sharma - సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇంటిని అదా శర్మ కొనుగోలు చేసింది. ప్రస్తుతం అందులోనే నివశిస్తోంది.

Adah Sharma | సుశాంత్ ఇంట్లో అదా శర్మ
X

బాలీవుడ్ నటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఇది జరిగి చాలా కాలమైంది. అతడి సూసైడ్ తో బాలీవుడ్ లో పెద్ద ఉద్యమమే చెలరేగింది. నెపొటిజం పై చాలామంది యుద్ధం ప్రకటించారు. అదే టైమ్ లో సుశాంత్ ఉన్న ఇంటిని అమ్మడానికి కూడా చాలా ప్రయత్నాలు జరిగాయి, కానీ డీల్ సెట్ కాలేదు.

ఎట్టకేలకు ఈ ఇంటిని హీరోయిన్ అదా శర్మ దక్కించుకుంది. చాలామంది సెంటిమెంట్ కొద్దీ ఈ ప్రాపర్టీకి దూరంగా ఉన్నారు. కానీ అదా శర్మ మాత్రం ముందుకొచ్చింది. తక్కువ రేటుకే ఈ ఇంటిని దక్కించుకున్నట్టు తెలుస్తోంది.

సుశాంత్ ఇంటిని తను కొనుగోలు చేసినట్టు అదా శర్మ ప్రకటించింది. ఇంటిలో మొదటి అంతస్తును పూర్తిగా దేవుడి మందిరంగా మార్చేసింది ఈ బ్యూటీ. దాని పైన ఉన్న గదిని మ్యూజిక్ రూమ్ గా, ఆ పక్కనే ఉన్న గదిని డాన్స్ ఫ్లోర్ గా మార్చేసింది.

వాటిపైన ఉన్న ప్రాంతం మొత్తాన్ని గార్డెన్ గా చేసింది. ఈ ఇంటిలో నెల రోజులుగా ఉంటోంది అదా శర్మ. ఇంట్లో తనకు చాలా పాజిటివ్ గా ఉందని తెలిపింది అదా శర్మ.

First Published:  3 Jun 2024 5:01 PM GMT
Next Story