Telugu Global
Business

సెన్సెక్స్‌ 1000 పాయింట్లకు పైగా ఢమాల్‌

దేశీయ మార్కెట్లకు 'ఫ్రై' డే

సెన్సెక్స్‌ 1000 పాయింట్లకు పైగా ఢమాల్‌
X

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాలతో శుక్రవారం ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. దీంతో ప్రారంభంలోనే సూచీలు పెద్ద ఎత్తున నష్టాల్లోకి జారుకున్నాయి. ఐటీ, మెటల్‌ స్టాక్స్‌ కుదేలయ్యాయి. ఇన్ఫోసిస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎంఅండ్‌ఎం, టీసీఎస్‌ వంటి ప్రధాన షేర్లలో విక్రయాలతో మార్కెట్లు నష్టాలబాట పట్టాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 87.33 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 73.68 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. బంగారం ఔన్సు 2,880.60 డాలర్ల వద్ద కదలాడుతున్నది.

ఉదయం 10.10 గంటల సమయంలో నెన్సెక్స్‌ భారీగా 1009.05 పాయింట్లు నష్టపోయి 73603.38 వద్ద.. నిఫ్టీ 285.40 పాయింట్లు తగ్గి,22259.65 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో అన్ని షేర్లు నష్టాల్లో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐటీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీ బ్యాంక్‌, ఐటీసీ, హెచ్‌యూఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, నెస్లే ఇండియా, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎల్‌అండ్‌టీ, సన్‌ఫార్మా, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు ప్రధానంగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

First Published:  28 Feb 2025 10:13 AM IST
Next Story