Telugu Global
Business

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

అమెరికా టారిఫ్‌ల ప్రకటనలు, ఆ దేశంలో నిరుద్యోగిత పెరగడం లాంటి పరిణామాలతో అప్రమత్తంగా మదుపర్లు

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు
X

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం నష్టాలతో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. అమెరికా టారిఫ్‌ల ప్రకటనలు, ఆ దేశంలో నిరుద్యోగిత పెరగడం లాంటి పరిణామాలతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో మార్కెట్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 230 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 23,350 దిగువన ట్రేడింగ్‌ మొదలుపెట్టింది. డారల్‌తో రూపాయి మారకం విలువ 87.38 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 70 డాలర్ల దిగువన ట్రేడవుతున్నది. బంగారం ఔన్సు 2,899.60 డాలర్ల వద్ద కదలాడుతున్నది.

ఉదయం 11 గంటల సమయంలో సెన్సెక్స్‌ 172.96 పాయింట్ల నష్టంతో 73942.21 వద్ద నిఫ్టీ 37.౯౫ పాయింట్లు కుంగి 22422.35 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, జొమాటో, ఎంఅండ్‌ఎం, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, సన్‌ ఫార్మా, మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా, ఐటీసీ, హెచ్‌యూఎల్‌ షేర్లు మాత్రమే లాభాల్లో కదలాడుతున్నాయి.

First Published:  11 March 2025 11:02 AM IST
Next Story