ఫ్లాట్గా ప్రారంభమై నష్టాల్లోకి మార్కెట్ సూచీలు
సూచీలు మొదట లాభాల్లో ట్రేడింగ్ మొదలుపెట్టినప్పటికీ కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి.

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల మధ్య మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో సూచీలు మొదట లాభాల్లో ట్రేడింగ్ మొదలుపెట్టినప్పటికీ కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 11 గంటలకు 216.23 నష్టంతో 73886.09 వద్ద.. నిఫ్టీ 54.95 పాయింట్లు కుంగి 22442.95వద్ద ఉన్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 87.28 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 70 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. బంగారం ఔన్సు 2,924.70 డాలర్ల వద్ద కదలాడుతున్నది.
సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పవర్గ్రిడ్ కార్పొరేషన్, జొమాటో ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే ఇండియా, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి.