Telugu Global
Andhra Pradesh

వైసీపీ కార్యాలయ ధ్వంసం.. బాబు రాక్షస పాలనకు నిదర్శనం

హైకోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా పార్టీ కేంద్ర కార్యాలయ భవనాన్ని కూల్చేశారని ఇసాక్‌ బాషా చెప్పారు. శని, ఆదివారాల్లో కోర్టు సెలవులు కావడంతో తెల్లవారుజామునే దొంగల్లా అక్కడికి చేరుకుని పోలీసుల సమక్షంలో కార్యాలయాన్ని ధ్వంసం చేశారని మండిప‌డ్డారు.

వైసీపీ కార్యాలయ ధ్వంసం.. బాబు రాక్షస పాలనకు నిదర్శనం
X

వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేయడం చంద్రబాబు రాక్షస పాలనకు నిదర్శనమని వైసీపీ ఎమ్మెల్సీ ఇసాక్‌ బాషా మండిపడ్డారు. శనివారం నంద్యాలలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు.. 24 గంటలు కూడా కాకముందే తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో బాబు ప్రభుత్వం ఆస్తుల విధ్వంసాలకు పాల్పడుతూ రాక్షస పాలన సాగిస్తోందని మండిపడ్డారు.

హైకోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా పార్టీ కేంద్ర కార్యాలయ భవనాన్ని కూల్చేశారని ఇసాక్‌ బాషా చెప్పారు. శని, ఆదివారాల్లో కోర్టు సెలవులు కావడంతో తెల్లవారుజామునే దొంగల్లా అక్కడికి చేరుకుని పోలీసుల సమక్షంలో కార్యాలయాన్ని ధ్వంసం చేశారని మండిప‌డ్డారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ మేలు చేశారని చెప్పారు. టీడీపీ నేతలతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఎటువంటి విద్వేషాలకూ పోబోమని ఓవైపు చెబుతూనే మరోవైపు ప్రజలపై దాడులు, ఆస్తుల విధ్వంసంతో అరాచక పాలన చేస్తున్నారని మండిపడ్డారు. విధ్వంసాలను మీడియాలో ప్రచారం కాకుండా వారి గొంతు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేశ్‌ రెడ్‌ బుక్‌ రాజ్యాంగంతోనే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని ఆయన మండిపడ్డారు.

First Published:  23 Jun 2024 5:28 AM GMT
Next Story