Telugu Global
Andhra Pradesh

పెండింగ్‌లో ఒక్క కేబినెట్‌ బెర్త్.. దక్కేది ఎవరికో..?

నిజానికి టీడీపీకి 20, జనసేనకు 4, బీజేపీకి 2 కేబినెట్‌ మంత్రి పదవులు దక్కుతాయని ప్రచారం జరిగింది. కానీ చివరకు జనసేన 3, బీజేపీ ఒక్క స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

పెండింగ్‌లో ఒక్క కేబినెట్‌ బెర్త్.. దక్కేది ఎవరికో..?
X

ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌లో ముఖ్యమంత్రితో పాటు 25 మంది మంత్రులకు అవకాశం ఉంది. ఐతే చంద్రబాబు కేవలం తనతో పాటు 24 మంది మంత్రులతో కూడిన జాబితాను రిలీజ్ చేశారు. మరో స్థానాన్ని భర్తీ చేయకుండా వదిలేశారు. దీంతో ఆ ఒక్క స్థానం ఎవరి కోసం అనేది ఆసక్తిగా మారింది.


కూటమిలో భాగంగా 21 ఎమ్మెల్యేలున్న జనసేనకు మూడు మంత్రి పదవులు ఇచ్చారు చంద్రబాబు. పవన్‌కల్యాణ్‌తో పాటు నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేష్‌ జనసేన నుంచి మంత్రి పదవులు దక్కించుకున్నారు. ఇక 8 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీకి ఒక్క మంత్రి పదవి మాత్రమే కేటాయించారు చంద్రబాబు. బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్‌కు కేబినెట్ బెర్త్ దక్కింది.


ఇక మరో స్థానం మిగిలి ఉండడంతో ఉత్కంఠ రేపుతోంది. నిజానికి టీడీపీకి 20, జనసేనకు 4, బీజేపీకి 2 కేబినెట్‌ మంత్రి పదవులు దక్కుతాయని ప్రచారం జరిగింది. కానీ చివరకు జనసేన 3, బీజేపీ ఒక్క స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మిగిలిన ఒక్క స్థానం చంద్రబాబు మిత్రపక్షాలకు కేటాయిస్తారా.. లేక టీడీపీ వాళ్లకే ఇచ్చుకుంటారా అనేది సస్పెన్స్‌గా మారింది.

First Published:  12 Jun 2024 5:56 AM GMT
Next Story