Telugu Global
Andhra Pradesh

అంబటి రాయుడు కుటుంబంపై దారుణమైన ట్రోలింగ్

అంబటి రాయుడిపై సోషల్ మీడియాలో డైరెక్ట్ అటాక్ కి దిగారు. ఆయన్ను, ఆయన కుటుంబ సభ్యుల్ని బండబూతులు తిడుతూ పోస్ట్ లు పెట్టారు. దీంతో ఆయన భార్యకు భయం వేసింది.

అంబటి రాయుడు కుటుంబంపై దారుణమైన ట్రోలింగ్
X

ఆమధ్య రాజకీయాల్లోకి వచ్చి అటు ఇటు పార్టీలు మారేసిన క్రికెటర్ అంబటి రాయుడు మళ్లీ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఆయనతోపాటు ఆయన భార్య, పిల్లలు కూడా ట్రోలింగ్ బాధితులుగా మారారు. ఆయన కుటుంబ సభ్యుల్ని హత్య చేస్తామని, అత్యాచారం చేస్తామని బెదిరించారు కొందరు. ఇది ఎవరిపని అనేది స్పష్టంగా తెలియదు కానీ, అంబటి రాయుడు సోషల్ మీడయాలో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఈ ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చిందని అర్థమవుతోంది.

అసలేం జరిగింది..?

ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో ప్లే ఆఫ్ స్టేజ్ కి వెళ్లిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుపై అంబటి రాయుడు సెటైర్లు పేల్చడం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆర్సీబీ టీమ్ తోపాటు, విరాట్ కోహ్లీకి కూడా ఓ రేంజ్ లో కౌంటర్లిచ్చారు రాయుడు. కోహ్లీ బాగా ఆడితే సరిపోదని, ఆయనకు ఆరెంజ్ క్యాప్ వస్తే ఆర్సీబీ గెలిచినట్టు కాదని అన్నారు. ఈ కామెంట్లకు ఆర్సీబీ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. అంబటి రాయుడిపై సోషల్ మీడియాలో డైరెక్ట్ అటాక్ కి దిగారు. ఆయన్ను, ఆయన కుటుంబ సభ్యుల్ని బండబూతులు తిడుతూ పోస్ట్ లు పెట్టారు. దీంతో ఆయన భార్యకు భయం వేసింది, ఆ విషయాన్ని ఫ్యామిలీ ఫ్రెండ్ తో చెప్పి బాధపడింది. అంబటి రాయుడు ఫ్యామిలీ ఫ్రెండ్ సామ్ పాల్.. ఈ విషయాన్ని బయటపెట్టారు. ఆ కుటుంబానికి పోలీసులు, న్యాయ వ్యవస్థ అండగా ఉండాలని కోరారు.


అంబటి రాయుడు నేరుగా ఈ బెదిరింపులపై స్పందించలేదు కానీ, ఆయన స్నేహితుడు మాత్రం సోషల్ మీడియాలో తన ఆవేదన బయటపెట్టారు. అంబటి రాయుడు కుటుంబంపై దారుణమైన కామెంట్లు చేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. తన భావాలను స్వేచ్ఛగా రాయుడు బయటపెట్టడం తప్పా అని ప్రశ్నించారు సామ్ పాల్. కాస్త ఆలస్యంగా ఈ వ్యవహారం వైరల్ గా మారింది.

First Published:  30 May 2024 6:29 AM GMT
Next Story