Telugu Global
Andhra Pradesh

హాట్ టాపిక్ గా శ్యామల.. చీకటి భాగోతం అంటూ రెచ్చిపోతున్న టీడీపీ

'ముసలి తోడేలు - గుంట నక్క' పేరుతో ఆమె చెప్పిన కథ తాజా రాజకీయాలకు అద్దం పడుతోంది. దీంతో వెంటనే టీడీపీ నష్టనివారణ చర్యలు మొదలు పెట్టింది. శ్యామలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తోంది.

హాట్ టాపిక్ గా శ్యామల.. చీకటి భాగోతం అంటూ రెచ్చిపోతున్న టీడీపీ
X

ఏపీ రాజకీయాల్లో యాంకర్ శ్యామల హాట్ టాపిక్ గా మారారు. పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు చేయడం అదే సమయంలో చంద్రబాబుని ముసలి తోడేలుతో పోలుస్తూ ఆమె ఓ పిట్టకథ చెప్పడంతో టీడీపీకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. శ్యామలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ టీడీపీకి మద్దతుగా ఉన్న కొందరు మహిళా నేతలు వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఏపీలో సమర్థ నాయకత్వం గురించి శ్యామల మాట్లాడితే, ఆమె వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తున్నారు టీడీపీ నేతలు.


ఎల్లో మీడియా, సోషల్ మీడియా అండతో ఏపీలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. జగన్ ని సమర్థించిన వారెవరైనా.. అపోజిషన్ మాత్రం అర్థంలేని వీడియోలతో వారిపై విరుచుకుపడిపోతోంది. వారిని భయభ్రాంతులకు గురి చేసి ప్రచారం చేయకుండా పంపించి వేయాలనే కుటిల ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా శ్యామల చెప్పిన పిట్టకథ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. 'ముసలి తోడేలు - గుంట నక్క' పేరుతో ఆమె చెప్పిన కథ తాజా రాజకీయాలకు అద్దం పడుతోంది. దీంతో వెంటనే టీడీపీ నష్టనివారణ చర్యలు మొదలు పెట్టింది. శ్యామలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తోంది.

శ్యామల ఇంకా జగన్ ని సపోర్ట్ చేస్తే, ఆమె వ్యక్తిగత జీవితాన్ని బయటపెడతామంటూ టీడీపీకి మద్దతిస్తున్న మహిళా నేతలు వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఎల్లో మీడియా ఆ వీడియోలను హైలైట్ చేస్తోంది. చీకటి భాగోతం తెరపైకి తెస్తామంటూ శ్యామలను బ్లాక్ మెయిల్ చేయడానికి వారు ప్రయత్నిస్తున్నారు. కులం కార్డు ఉపయోగించుకుని ఆమె ఏపీ రాజకీయాల్లో విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. టీడీపీ నేతల వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. సాటి మహిళ అని కూడా చూడకుండా శ్యామలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్న వారిని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.

First Published:  4 May 2024 3:02 PM GMT
Next Story