Telugu Global
Andhra Pradesh

మెగా బ్రదర్స్ తో మోదీ.. వైరల్ అవుతున్న వీడియో

చిరంజీవి, పవన్ కల్యాణ్.. మధ్యలో ప్రధాని మోదీ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మెగా బ్రదర్స్ తో మోదీ.. వైరల్ అవుతున్న వీడియో
X

చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో ఈసారి మెగా హవా ఎక్కువగా కనపడింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా మెగా బ్రదర్స్ చేతులు పట్టుకుని వారి మధ్యలో నిలబడి ప్రజలకు అభివాదం చేశారు, ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ సన్నివేశం ఈ కార్యక్రమానికే హైలైట్ అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. చిరంజీవి, పవన్ కల్యాణ్.. మధ్యలో ప్రధాని మోదీ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


బీజేపీ, టీడీపీ పొత్తుకి ప్రధాన కారణం పవన్ కల్యాణేనంటూ గతంలో చంద్రబాబు కూడా పలుమార్లు ప్రస్తావించారు. కూటమి వల్ల లాభపడాలని టీడీపీ ఎన్నికల ముందు అనుకుంది, కానీ ఫలితాల తర్వాత కూటమి వల్ల అంతిమ ప్రయోజనం ఎక్కువగా బీజేపీకి లభించింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి తెలుగు ప్రజలు ఊపిరులూదారు. తెలంగాణ నుంచి బీజేపీ సొంతగా 8 స్థానాలు గెలుచుకోగా, ఏపీ నుంచి కూటమి మొత్తంగా 21 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఏపీలో కూటమికి మూలకారణం అయిన పవన్ కల్యాణ్ కి మోదీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఇటీవలే చిరంజీవికి పద్మ విభూషణ్ ని కూడా కేంద్రం ప్రకటించింది. ఓ దశలో ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. ఏపీ ఎన్నికల వేళ కనీసం కూటమి తరపున అయినా ఆయన ప్రచారం చేస్తారని అనుకున్నారు. అయితే కేవలం పవన్ కల్యాణ్ కి మాత్రం ఓటు వేయండని సోషల్ మీడియా ద్వారా చెప్పి చిరంజీవి సరిపెట్టారు. ఒకరిద్దరు సన్నిహితలకు కూడా ఆయన ప్రత్యేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. చిరంజీవికి, ఆయన అభిమానులకు మరింత దగ్గరయ్యేందుకే ఇప్పుడు మోదీ స్టేజ్ పై అన్నదమ్ములిద్దరి చేతులు పట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చినట్టు తెలుస్తోంది.

First Published:  12 Jun 2024 8:33 AM GMT
Next Story